స్వతంత్ర, వెబ్ డెస్క్: బీజేపీ ఎంపీ, భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్స్ చేపట్టిన ఆందోళనలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి సాక్షి మాలిక్ తప్పుకుంది. తిరిగి ఆమె ఉత్తర రైల్వేలోని తన పదవిలో చేరినట్లు తెలుస్తోంది. బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం సాక్షి మాలిక్ తప్పుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఇక ఈ నెల 9వ తేదీ లోపు బ్రిజ్ భూషణ్ను అరెస్ట్ చేయకపోతే తమ పతకాలను గంగా నదిలో పడేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రిజ్ భూషణ్పై రెండు FIRలు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో సాక్షి నిర్ణయంతో మిగిలిన రెజ్లర్లు ఎంతవరకు పోరాడుతారో వేచి చూడాలి.
మహిళా రెజ్లర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్
0
498
Previous article
Latest Articles
పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 2,890 రూపాయలు పెరిగి లక్ష 49 వేల 730 రూపాయలకు చేరింది. 22 క్యారెట్ల...
- Advertisement -
- Advertisement -


