శ్రీహరికోటలో PSLV-C55 మొదటి దశ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ కు చెందిన 741కిలోల టిలియోస్-2తో పాటు 16 కిలోల లూమిలైట్-4 ఉపగ్రహాలను నింగిలోకి పంపారు శాస్త్రవేత్తలు. షార్ లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం చేపట్టారు. ఇప్పటివరకు 424 ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా కక్ష్యలోకి పంపింది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49గంటలకు ప్రారంభమై.. ఇవాళ మధ్యాహ్నం 2.19గంటలకు పూర్తి అయింది. మొత్తం 25గంటల 30నిమిషాల కౌంట్ డౌన్ ముగియడంతో PSLV-C55 ఉప్రగహం నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటికే ప్రయోగం విజయవతం కావాలని ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన PSLV-C55
0
367
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


