తెలంగాణ గడ్డపై ఏపీ నేతలతో భేటీతో మోదీ మార్క్ మ్యాజిక్

ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. తెలంగాణ గడ్డపై ఏపీ నేతలతో భేటీతో మోదీ మార్క్ మ్యాజిక్ కనిపించింది. చంద్రబాబు నివాసానికి వెళ్లిన మోదీ.. ఆయనతో గంటకు పైగా చర్చించారు. సుదీర్ఘంగా పీఎం, ఏపీ సీఎం చర్చలు కొనసాగాయి.

హైదరాబాద్‌ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ రాష్ట్ర రాజధానికి వచ్చారు. హెచ్ ఐసీసీలో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాల అనంతరం ప్రధాని… ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నివాసాలకు వెళ్లి వారిని కలిశారు. జూబ్లీహిల్స్‌లో ఉన్న వారి ఇళ్లకు వెళ్లిన ప్రధాని ముందుగా పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించారు.

ఇటీవల సైనస్‌ సమస్య కారణంగా పవన్‌ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటుండగా, ప్రధాని మోదీ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అనంతరం ప్రధాని చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌ ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలికారు. గంటకు పైగా అక్కడ గడిపిన మోదీ, చంద్రబాబుతో పలు కీలక అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్రాభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారి మధ్య సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్