చేనేత, జౌళి శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రభుత్వ శాఖల నుండి ఇప్పటి వరకు TGCOకి వచ్చిన ఆర్డర్లు, వాటి పురోగతిపై చర్చించారు. ప్రభుత్వ శాఖలకు, కార్పొరేషన్లకు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమగు వస్త్రాన్ని తప్పనిసరిగా టెస్కో ద్వారా కొనుగోలు చేయాలని తుమ్మల సూచించారు. 2025-26 సంవత్సరానికి అవసరమయ్యే వస్త్ర ఇండెంట్ను టెస్కో వారికి నవంబర్ 15లోగా సమర్పించాలని ఆదేశించారు. చేనేత కార్మికుల ఉపాధికి తోడ్పాటు అందించేందుకు కృషి చేయాలని మంత్రి తుమ్మల కోరారు.