తిరుపతి: మిచాంగ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఒకవైపు చెన్నైని అతలాకుతలం చేస్తూనే, మరోవైపు ఏపీలోని కోస్తా ప్రాంతాల్లోనూ విలయతాండవం చేస్తోంది. తిరుపతి జిల్లాలో భారీ వర్షం కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిత్తూరు చెరువు పొంగిపొర్లడంతో ఏర్పేడు మండలం బండారుపల్లి గ్రామం వద్ద వెంకటేష్, శివ అనే ఇద్దరు యువకులు వాగులో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ శ్రీహరి తన బృందంతో కలిసి వెళ్లి యువకులను రక్షించారు.
పూర్తి వివరాలు కింది వీడియోలో…