లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటింగ్ కు దిగిన బ్యాటర్లందరూ రెచ్చిపోవడంతో ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసి ఔరా అనిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. కైల్ మేయర్స్(54), అయూష్ బదానీ(43) పరుగులతో అదరగొట్టారు. అనంతరం వచ్చిన మార్కస్ స్టాయినిస్ అయితే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇక చివర్లో నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45 పరుగులతో దుమ్మురేపాడు. లక్నో బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. 14 సిక్సులు, 27ఫోర్లతో బౌలర్లపై వీరవిహారం చేశారు. ఇంత భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి మరి.
రెచ్చిపోయిన లక్నో బ్యాటర్లు.. సీజన్ లోనే టాప్ స్కోర్ నమోదు
0
294
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


