లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బ్యాటింగ్ కు దిగిన బ్యాటర్లందరూ రెచ్చిపోవడంతో ఈ ఐపీఎల్ సీజన్లోనే అత్యధిక స్కోర్ నమోదైంది. 20ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసి ఔరా అనిపించారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ తక్కువ స్కోర్ కే వెనుదిరిగినా.. కైల్ మేయర్స్(54), అయూష్ బదానీ(43) పరుగులతో అదరగొట్టారు. అనంతరం వచ్చిన మార్కస్ స్టాయినిస్ అయితే సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 40 బంతుల్లోనే 72 పరుగులు చేశాడు. ఇక చివర్లో నికోలస్ పూరన్ 19 బంతుల్లో 45 పరుగులతో దుమ్మురేపాడు. లక్నో బ్యాటర్ల దెబ్బకు పంజాబ్ బౌలర్లు తేలిపోయారు. 14 సిక్సులు, 27ఫోర్లతో బౌలర్లపై వీరవిహారం చేశారు. ఇంత భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేజ్ చేస్తుందో లేదో చూడాలి మరి.
రెచ్చిపోయిన లక్నో బ్యాటర్లు.. సీజన్ లోనే టాప్ స్కోర్ నమోదు
0
268
Latest Articles
సర్కారు బాయి సినిమా నుంచి బర్త్ డే పోస్టర్ రిలీజ్
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయన్స్ గా నటిస్తున్న సినిమా "సర్కారు బాయి". ఈ చిత్రాన్ని డెక్కన్ ఫిలింస్ సమర్ఫణలో ప్రొడ్యూసర్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డి నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో...
- Advertisement -
- Advertisement -


