దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ 10వేలపైనే కేసులు రావడం ఆందోళన కల్గిస్తోంది. గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 10,753 కేసులు నమోదుకాగా.. 27మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 53,720కి చేరుకోగా..ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 5,31,064కి చేరుకుంది. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 6.78శాతంగా నమోదైంది. కేసుల పెరుగుదలకు XBB.1.16 వేరియంట్ కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. కాగా శుక్రవారం 11,109 కొత్త కరోనా కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
దేశంలో ఆగని కరోనా విజృంభణ.. 27మంది మరణం
0
353
Latest Articles
ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై సోషల్ మీడియాలో అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ప్రశ్న రావణ్ పై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. ఈ...
- Advertisement -
- Advertisement -


