మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతోంది. సూర్యాపేట దగ్గర ముగిసిన యాత్రను.. ఇవాళ అక్కడి నుంచే ప్రారంభించనున్నారు. సాయంత్రం భువనగిరిలో రోడ్ షోలో పాల్గొం టారు కేసీఆర్. నిన్న మిర్యాలగూడ రోడ్ షోలో కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు. తనను జైలులో పెడతామని అంటున్నారని… జైళ్లకు భయపడే వాడినే అయితే ఉద్యమం చేసేవాడినా? అని కేసీఆర్ అన్నారు. గుడ్లు పీకుతా.. జైళ్లో వేస్తా.. ఇదేనా ముఖ్యమంత్రి మాట్లాడే భాష? అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తారు కేసీఆర్. జిల్లాలో చేతకాని మంత్రులు ఉన్నారని ధ్వజమెత్తారు. సాగర్ లో నీళ్లు ఉన్నా సాగునీరు విడుదల చేయలేరని విమర్శించారు.