అసోం రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. హిమంత బిశ్వ శర్మ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గౌహతిలోని రాజ్భవన్లో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ ఆయనను కోరారు. మే 12న ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


