ఇది విన్నారా.. రూపాయికే బస్సు ప్రయాణం.. దేశమంతా తిరగొచ్చు..!

స్వతంత్ర వెబ్ డెస్క్: న్యూగో సంస్థ బంపరాఫర్‌ ప్రకటించింది. ఇంటర్‌–సిటీ ఎలక్ట్రిక్‌ ఏసీ కోచ్‌ ( Inter-City Electric) సేవలందించే న్యూగో సంస్థ (Newgo Corporation) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా రూపాయికే బస్సు ప్రయాణ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నెల 15న తమ రవాణా మార్గాల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కేవలం రూపాయితోనే ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ సందర్భంగా గ్రీన్‌సెల్‌ మొబిలిటీ సీఈఓ దేవేంద్ర చావ్లా(Devendra Chawla) మాట్లాడుతూ..పర్యావరణ స్థిరత్వంతో పాటు దేశాన్ని పచ్చదనంగా మార్చడానికి ఈవీ సేవలు కొనసాగిస్తున్నామని తెలిపారు. పర్యావరణహిత ప్రయాణాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడంలో భాగంగా ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు.

పంద్రాగస్టు రోజున ఈ ప్రయాణ ఆఫర్‌ను పొందడానికి బుకింగ్స్‌ మొదలయ్యాయని, రాష్ట్రంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తమ రవాణా సేవలు కొనసాగుతున్నాయన్నారు.  దేశవ్యాప్తంగా ఇండోర్‌– భోపాల్, ఢిల్లీ–చండీగఢ్, ఢిల్లీ– ఆగ్రా, ఢిల్లీ–జైపూర్, ఆగ్రా–జైపూర్, బెంగళూరు–తిరుపతి, చెన్నై–తిరుపతి, చెన్నై–పుదుచ్చేరి తదితర మార్గాల్లో తమ సేవలు కొనసాగుతున్నాయని, దేశమంతా ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వివరించారు. బుకింగ్స్‌ కోసం న్యూగో వెబ్‌సైట్‌ https:// nuego. in/ booking, సంస్థ అధికారిక మొబైల్‌ అప్లికేషన్లలోనూ బుకింగ్‌ చేసుకోవచ్చని దేవేంద్ర చావ్లా తెలిపారు.

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్