టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ ఈ నెలలో భారత్కు రానున్నారు. ప్రధాని మోదీతోనూ భేటీ కాను న్నారు. ఈ మేరకు భారత పర్యటన, ప్రధానితో భేటీని ధ్రువీకరిస్తూ ఎక్స్ వేదికగా మస్క్ స్పందిం చారు. మోదీతో సమావేశం అయ్యేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా దేశం లో పెట్టుబడులు, టెస్లా కొత్త ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనలు ఉండొచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపినట్లు రాయిటర్స్ పేర్కొంది. ఢిల్లీలో ఏప్రిల్ 22న ప్రధానితో మస్క్ భేటీ కానున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆపై తన ప్రణాళికలను వేరేగా వెల్లడించను న్నారని పేర్కొన్నాయి. విద్యుత్ కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం టెస్లా ప్రతినిధులు భారత్లో సందర్శించనున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఏప్రిల్ నెలలోనే ఈ పర్యటన ఉంటుందని ప్రచారం జరిగింది. మరోవైపు టెస్లా ప్లాంట్ను ఆకర్షించేందుకు వివిధ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇందులో గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. టెస్లాతో సంప్రదింపులు జరుపుతు న్నట్లు తెలంగాణ ఇప్పటికే ప్రకటించింది.