Tirumala | ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కల్పిస్తున్నారు ఆలయ అధికారులు. స్వామి వారి కైంకర్యాలన్నీ ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారు. రోజూవారీగానే శ్రీవారి నిత్యపూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అర్చకులు. సోమవారం 63,870 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 27,480 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కాగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.88 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.
నేరుగానే శ్రీవారి దర్శనం… హుండీ ఆదాయం ఎంతంటే?
0
262
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


