29.6 C
Hyderabad
Sunday, June 15, 2025
spot_img

ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.. పేర్ని నాని ఫైర్‌

స్వతంత్ర వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కొనసాగుతున్నాయి. సమావేశాల్లో భాగంగా అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌పై సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలో టీడీపీ నేత లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు వచ్చేలా ప్లాన్‌ మార్చారని తీవ్ర విమర్శలు చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.

కాగా, అసెంబ్లీలో పేర్ని నాని మాట్లాడుతూ.. రాజధానిపై చంద్రబాబు రోజుకో డ్రామా నడిపారు. చంద్రబాబు ప్రభుత్వంలోని అవినీతి కథల్లో ఇది కూడా ఒకటి. దోపిడీకి దొంగలు రెక్కీ చేసినట్టుగా రింగ్‌ రోడ్డు స్కామ్‌ జరిగింది. ఇది కేబినెట్‌ నిర్ణయమంటూ చంద్రబాబు కబుర్లు చెప్పారు. మాస్టర్‌ ప్లాన్‌ పేరుతో స్కామ్‌ నడిపించారు. లింగమనేని రమేష్‌ పొలం మధ్యలో నుంచి ఇన్నర్ రింగ్‌ రోడ్డు వచ్చేలా ప్లాన్‌ మార్చారు. హెరిటేజ్‌ సంస్థ, నారాయణ కాలేజీల కోసం ప్లాన్‌ మార్చారు. ఏ-14గా ఉన్న లోకేష్‌ ఐఆర్‌ఆర్‌తో నాకేం సంబంధం అంటున్నారు. 2008 నుంచి 2017 వరకు హెరిటేజ్‌ సంస్థకు లోకేష్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. లోకేష్‌ హెరిటేజ్‌ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్నప్పుడే అమరావతిలో భూములు కొనాలని నిర్ణయించారు.

చంద్రబాబు, నారాయణ దళితుల పేదల నుంచి అసైన్డ్‌ భూములను లాక్కున్నారు. చట్టం ప్రకారం అసైన్డ్‌ భూములు లాక్కోవడం సాధ్యం కాదని చెప్పినా వినలేదు. న్యాయపరమైన చిక్కులు వస్తాయని చెప్పినా జీవో-41 విడుదల చేశారు. దొంగలు రెక్కీ చేసినట్టుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌ చేశారు. కేసులు ఎక్కువగా ఉన్నవారికి నామినేటెడ్‌ పదవులు ఇస్తామన్న లోకేష్‌ ఇప్పుడు ఎక్కడ?. ఇక్కడ యువతను రెచ్చగొట్టి ఇప్పుడు ఢిల్లీలో తిరుగుతున్నారు. రూ.371 కోట్లకు ఇంత రాద్ధాంతం దేనికని నారా భువనేశ్వరి సూక్తులు చెబుతున్నారు. రూ. 371​కోట్లు టిప్పే అనుకుంటే అమరావతిలో 10 ఎకరాలు ఎందుకు కొన్నారు?.

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును అటు తిప్పి.. ఇటు తిప్పి పాల కంపెనీకి 5 ఎకరాలు ఇచ్చారు. దేశభక్తితోనే నా ఇల్లును చంద్రబాబుకు ఇచ్చినట్టు లింగమనేని హైకోర్టులో చెప్పారు. సీఎం పదవి పోయిన వెంటనే రూ.27లక్షలు లింగమనేనికి అద్దె ఇచ్చారు. రూ.27లక్షల లావాదేవీలపై నారా, లింగమనేని కుటుంబాలు చెప్పవు. రాజధాని ఏర్పాటుపై కమిటీ ఇచ్చిన రిపోర్టును చంద్రబాబు తుంగలో తొక్కారు. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో రాజధాని ఏర్పాటుకు జీవో ఇచ్చారు. ల్యాండ్‌ పూలింగ్‌కు ఒప్పుకోని వారిని ఏ-2, ఏ-14 బెదిరించారు. ప్రభుత్వ భూమిని గవర్నమెంట్‌ లాక్కుంటుదని భయపెట్టారు. ఎకరం భూమిని రెండు నుంచి ఐదు లక్షలకే రాయించుకున్నారు. ఇలాంటి వాళ్లకు శిక్ష పడాల్సిందే అని అన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్