వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయి దాడి ఘటన అనంతరం నిన్న తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్.. ఎన్టీఆర్ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ 16వ రోజు జగన్ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి కిందకు దిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.
వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొం టారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.