25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

16వ రోజుకు చేరుకున్న సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సు యాత్ర

   వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాయి దాడి ఘటన అనంతరం నిన్న తిరిగి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభించిన జగన్.. ఎన్టీఆర్ జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోకి ప్రవేశించారు. ఇవాళ 16వ రోజు జగన్‌ బస్సు యాత్రను కొనసాగించనున్నారు. యాత్రలో భాగంగా బస్సు నుంచి కిందకు దిగి ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటు న్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా జగన్ యాత్ర కొనసాగుతోంది. ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు.

   వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా సీఎం జగన్‌ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు. ఉండి శివారులో సీఎం జగన్‌ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్‌ రోడ్‌ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్‌ కాలేజ్‌ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొం టారు. సభ అనంతరం పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్‌ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్