స్వతంత్ర, వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదంపై కేసు నమోదు చేసింది సీబీఐ. గత వారం మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 278 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న ఆరోపణలు రావడంతో సీబీఐ రంగ ప్రవేశం చేసింది. రైల్వేశాఖ విజ్ఞప్తి మేరకు.. ఒడిశా ప్రభుత్వం అనుమతితో కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులకు అనుగుణంగా కేసు నమోదు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఈరోజు 10 మంది సీబీఐ అధికారుల బృందం ఘటనాస్థలికి చేరుకొని.. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించింది. ఈ ఘటన వెనుక గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది.