నేడు సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు విచారణ

Amaravati Case |ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి సంబంధించిన కేసు ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. రాజధాని అమరావతిని నిర్ణీత గడువులోపు అభివృద్ధి చేయాలంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోవైపు హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ అమరావతి రైతులు సైతం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈరెండింటిని జస్టిస్‌ కె. ఎం. జోసెఫ్, జస్టిస్‌ బివి నాగరత్నలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

సుప్రీంకోర్టులో రాజధాని అమరావతి కేసు(Amaravati Case) విచారణపై ఉత్కంఠ నెలకొంది. కోర్టు తీర్పునిస్తుందా.. లేదా ఈ కేసు విచారణను వాయిదా వేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఈ కేసు విచారణను త్వరగా చేపట్టాలని ఇప్పటికే అనేకసార్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు విశాఖపట్టణంలో పరిపాలన రాజధాని ఉంటుందని.. తన పాలన విశాఖకు షిఫ్ట్ చేస్తానంటూ ఇప్పిటికే ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖ్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు ఎలా ఉండబోతుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

Read Also:  తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

Follow us on:   Youtube ,   Instagram

Latest Articles

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి

మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్