రంగారెడ్డి జిల్లాలోని దుండిగల్లో గంజాయి పట్టుబడింది. 1.35 కేజీల గంజాయిని మేడ్చల్ ఎస్ఓటీ బృందం సీజ్ చేసింది. ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయి తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్నారు కేటుగాళ్లు. గంజాయి విక్రయిస్తుండగా వల పన్ని ఎస్ఓటీ బృందం పట్టుకుంది. 7వేలకు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 15వేలకు గంజాయి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో కేటుగాళ్లు గంజాయి దందాకు తెరలేపినట్లు తెలిసింది. అరెస్ట్ అయిన వారిలో రంజాన్ దాస్, కేశవ్ కౌర్, కె.గంగా సెంట్రింగ్ పనిచేస్తున్నారని ఎస్వోటీ బృందం తెలిపింది.


