స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్లో ‘హిందూ ఏక్తా యాత్ర’ జరగనుంది. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రతి ఏటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ చేపడుతున్నామని సంజయ్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని సంజయ్ పిలుపునిచ్చారు.
‘హిందూ ఏక్తా యాత్ర’లో పాల్గొనాలని యువతకు సంజయ్ పిలుపు
0
466
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


