స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్లో ‘హిందూ ఏక్తా యాత్ర’ జరగనుంది. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ప్రతి ఏటా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఈసారి దాదాపు లక్ష మందితో ‘హిందూ ఏక్తా యాత్ర’ చేపడుతున్నామని సంజయ్ తెలిపారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుతామన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొనాలని సంజయ్ పిలుపునిచ్చారు.