స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8 నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు అవినాశ్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై ఆయనను అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. కాగా అవినాశ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం విచారణకు హాజరుకావాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత శనివారం కూడా అవినాశ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి సవాల్ చేసిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
0
472
Previous article
Next article
Latest Articles
స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -
- Advertisement -


