స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ8 నిందితుడు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అధికారులు అవినాశ్ని ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5గంటల వరకు విచారణ కొనసాగనుంది. వివేకా హత్య జరిగిన రోజు జరిగిన ఫోన్ సంభాషణలపై ఆయనను అధికారులు విచారించనున్నారని తెలుస్తోంది. కాగా అవినాశ్కి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు ప్రతి శనివారం విచారణకు హాజరుకావాలని షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత శనివారం కూడా అవినాశ్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మరోవైపు వివేకా కుమార్తె సునీతారెడ్డి సవాల్ చేసిన ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
సీబీఐ విచారణకు హాజరైన అవినాశ్ రెడ్డి
0
495
Previous article
Next article
Latest Articles
తెలంగాణలో భారీ వర్షాలు…ప్రాజెక్టులకు జలకళ
ఎగువన కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని పలు ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదతో SRSP,కడెం, ఎల్లంపల్లి, జురాల ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టు నిండుకుండలా...
- Advertisement -
- Advertisement -


