శాంతి భద్రతలు కాపాడాల్సిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు విధినిర్వహణను మరిచిపోయి మందుబాబులతో కలిసి మద్యం సేవించటం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా మండ్లమూరు మండలం శంకరా పురంలో ఈ ఘటన జరిగింది. రాజకీయ కక్షల నేపథ్యంలో జరుతున్న దాడులను అరికట్టేందుకు గ్రామం లో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఆ డ్యూటీలో వచ్చిన ఒక ఏఎస్ఐ పార్టీ నేతలతో కలిసి యూనిఫాం తోనే మందుకొట్టాడు. సెల్ఫోన్లో చిత్రీకరించిన వారు సోషల్ మీడియాలో షేర్ చెయ్యటంతో జిల్లాలో దుమారం చెలరేగింది. ఏఎస్సైను వీఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ ఉత్తర్వులు జారీ చేశారు.
డ్యూటీ మరిచి మందేసిన ఏఎస్ఐ వెంకటేశ్వర్లు
0
241
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


