హైదరాబాద్ పాతబస్తీ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మునుగోడు ఉపఎన్నికలో బీఆర్ఎస్ నుంచి రూ.25కోట్లు తీసుకున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేసేందుకు రేవంత్ రెడ్డి బయలుదేరారు. దీంతో చార్మినార్ ప్రాంతమంతా పోలీసులు భారీగా మోహరించారు. మరోవైపు రేవంత్ సవాల్ పై ఈటల ఇంతవరకు స్పందించలేదు. దీంతో ఆయన ప్రమాణం చేసేందుకు ఆలయం వద్దకు వస్తారా? రారా? అనే ఉత్కంఠ నెలకొంది.