MP Avinash Reddy | వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ లోని సీబీఐ ఆఫీసులో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొంది. ఇప్పటికే అవినాష్ రెడ్డిని సీబీఐ పలుమార్లు విచారించింది. ఈ కేసులో ఈరోజు ఉదయం అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి 14 రోజుల రేమండ్ విధించి చంచల్ గూడ జైలుకి పంపించారు.