మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో సొరంగంలోకి వెళ్లిన మంత్రి..అక్కడ జరుగుతున్న లైనింగ్, టీబీఎం తొలగింపు పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రాజెక్ట్ హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్న్స్ పనులు పూర్తయినట్లు మంత్రి నిమ్మల తెలిపారు. కొల్లంవాగు నుంచి టన్నెల్స్లోకి నీరు చేరేందుకు జరుగుతున్న మక్ తొలగింపు పనుల్లో గణనీయమైన పురోగతి సాధించామన్న ఆయన… టన్నెల్-1, టన్నెల్-2ల్లో అడ్డుగా ఉన్న మట్టిని తొలగింపు పనులు స్పీడప్ చేసినట్లు వెల్లడించారు. సీజన్ ప్రారంభానికి ముందే నల్లమలసాగర్ రిజర్వాయర్ నింపేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు


