34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

మ్యాంగో మార్కెట్‌లో కెమికల్ దందా… మెరిసే పండుతో తస్మాత్‌ జాగ్రత్త

వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్లన్నీ మామిడి పండ్లతో కళకళలాడుతుంటాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తినే పండు మామిడి. రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండటంతో వేసవిలో మామిడి పండ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. సహజంగా మగ్గాల్సిన మామిడి పండ్లను ప్రమాదకర రసాయనాలతో గంటల వ్యవధిలోనే పసుపురంగులోకి మార్చి మార్కెట్‌లో విక్రయిస్తున్న వైనం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

రసాయనాలతో మామిడిని మగ్గబెడుతున్న వ్యాపారులు

ప్రస్తుతం పలు మార్కెట్లలో చైనా నుంచి తెచ్చిన రసాయనాలు, కృత్రిమ మగ్గింపు పౌడర్లు, ద్రావణాలను ఉపయోగించి పచ్చగా ఉన్న మామిడి పండ్లను ఒక్కరాత్రిలోనే ఆకర్షణీయమైన పసుపు రంగులోకి మార్చేస్తున్నారు. బయటకు చూడటానికి ఎంతో తాజాగా, మెరిసేలా కనిపించే ఈ పండ్లు లోపల మాత్రం పూర్తిగా సహజంగా మగ్గకపోవడం గమనార్హం. వ్యాపారులు తక్కువ కాలంలో ఎక్కువ లాభాల కోసం ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

రసాయనాలతో ఆరోగ్యానికి హానికరం

ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నదేమిటంటే… ఇలాంటి కెమికల్స్‌తో మగ్గించిన పండ్లు ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమవుతాయి. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్‌, ఇతర కృత్రిమ రసాయనాల వాడకం వల్ల తలనొప్పి, వాంతులు, కడుపునొప్పి, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలంగా ఇలాంటి పండ్లు తింటే కాలేయం, మూత్రపిండాలపై కూడా ప్రభావం పడే అవకాశముందని నిపుణులు సూచిస్తున్నారు.

డబ్బుల కోసం వ్యాపారుల దందా

ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి లాభాల కోసం వ్యాపారులు ఈ దందా కొనసాగిస్తున్నారని వినియోగదారులు మండిపడుతున్నారు. మార్కెట్‌లో కనిపిస్తున్న ప్రతి మెరిసే పండు వెనుక రసాయనాల ముప్పు దాగి ఉందేమోనన్న భయం ప్రజల్లో పెరుగుతోంది. ముఖ్యంగా చిన్నారులు ఎక్కువగా మామిడి పండ్లు తినే సమయంలో ఈ సమస్య మరింత ఆందోళన కలిగిస్తోంది.

మెరిసే పండుతో జాగ్రత్త

ఇక వినియోగదారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సహజంగా మగ్గిన మామిడి పండ్లకు పూర్తిగా ఒకే రంగు ఉండదని, కొంత పచ్చదనం కనిపిస్తుందని చెబుతున్నారు. అలాగే కెమికల్‌తో మగ్గించిన పండ్లకు తీవ్రమైన రంగు, అసహజమైన మెరుపు ఉండే అవకాశముందని పేర్కొంటున్నారు. పండ్లు కొనుగోలు చేసిన తర్వాత శుభ్రంగా కడిగి వాడాలని సూచిస్తున్నారు.

వ్యాపారులపై కఠిన చర్యలకు డిమాండ్‌

కెమికల్ మామిడి దందాపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లలో ఆహార భద్రతా శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి రసాయనాలతో మగ్గించిన పండ్ల విక్రయాలను అరికట్టాలని కోరుతున్నారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.

వేసవి వచ్చిందంటే మామిడికి డిమాండ్‌
చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇష్టంగా తినే పండు మామిడి
మ్యాంగో మార్కెట్‌లో కెమికల్ దందా
చైనా రసాయనాలతో గంటల్లోనే పచ్చని పండ్లు పసుపురంగులోకి
కెమికల్స్‌తో మగ్గించిన పండ్లతో ఆరోగ్య సమస్యలు
ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్న వ్యాపారులు
మార్కెట్‌లో కనిపిస్తున్న ప్రతి మెరిసే పండు వెనుక రసాయనాల ముప్పు
కెమికల్ మామిడి దందాపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్‌

Latest Articles

సోమనాథ్‌ ఆలయాన్ని పునరుద్ధరించి 75 ఏళ్లు… అమృత్‌ మహోత్సవంలో పాల్గొన్న మోదీ

సోమనాథ్‌ ఆలయ రూపురేఖలు మారుస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సోమనాథ్ అమృత్ మహోత్సవ్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్