సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని సీతాఫల్ మండి ఇందిరానగర్లో దారుణహత్య జరిగింది. యావన్ అనే యువకుడిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అల్వాల్కు చెందిన యావన్ సీతాఫల్మండికి చెందిన యువతిని ప్రేమిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అమ్మాయిని కలిసేందుకు కొంతకాలంగా యావన్ సీతాఫల్మండి వస్తున్నాడు. ఈ క్రమంలో యావన్ తనకు తెలిసిన వారి ఇంటి వద్ద టీవీ చూస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు యావన్ను హతమార్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.


