ప్రజలు కేసీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. నేడు మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తొలుత ఆమె అభిమానులు శాసనమండలి విప్గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా గుమ్మడికాయతో దిష్టి తీశారు. స్వామివారిని దర్శనం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ప్రజలు ఆ హామీలను నమ్మి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీసం శివరాత్రి సందర్భంగా కురవి ఆలయంలో కనీస ఏర్పాట్లు కూడా చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైందని..ఇకనైనా ప్రజా సంక్షేమంపై రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని అన్నారు.