వైసీపీ నేత వల్లభనేని వంశీ మొదటిరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. రెండున్నర గంటలపాటు వంశీని వంశీని వివిధ కోణాల్లో విచారించారు కృష్ణలంక పోలీసులు. ముఖ్యంగా టీడీపీ కార్యాలయంపై దాడి ఎవరి ఆదేశాలతో జరిగింది.. దానికి అసలు కారణమేంటి.. అనే అంశాలపై పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వల్లభనేని వంశీ విచారణలో టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ స్టేట్మెంట్పై కూడా ప్రత్యేకంగా ప్రశ్నలు సంధించారు. పోలీసుల పలు ప్రశ్నలకు వంశీ సమాధానాలు దాటవేశారు. విచారణ అనంతరం వల్లభనేని వంశీని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన్ను పూర్తిగా పరీక్షించిన అనంతరం విజయవాడ జిల్లా జైలుకు తరలిస్తారు.