కేంద్ర బడ్జెట్ పై.. బీజేపీ ఎమ్మెల్యేలు సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ హర్షం ప్రకటించారు. అమరావతిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే.. ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని.. ఇది ఏపీ చరిత్రలో చాలా శుభదినంగా నిలిచిపోతుందని.. సుజనాచౌదరి తెలిపారు. గత ఐదేళ్లుగా చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందని సుజనాచౌదరి అన్నారు. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసని.. డబులింజన్ సర్కార్ థమాకా ఏమిటో .. ఈ రోజు ప్రజలకు తెలిసిందని సుజనా చౌదరి అన్నారు. ఎప్పుడూ లేనన్ని నిధులు కేంద్రం కేటాయించిందని.. పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితే లక్ష కోట్లు జి ఎస్ డి పి పెరుగుతుందని సుజనాచౌదరి తెలిపారు. ఏపీ కి ఎప్పుడు లేనంత నిధులు ఇవ్వడం సంతోషకరమని.. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి సంబంధించి పది అంశాలు కూడా మేలు చేసేవే అని కామినేని శ్రీనివాస్ అన్నారు.
అమరావతిని వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసింది – సుజనాచౌదరి
0
166
Previous article
Next article
Latest Articles
చూపరులను కనువిందు చేస్తోన్న పొల్లూరు వాటర్ఫాల్స్
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదలతో మోతుగూడెం సమీపంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం పొల్లూరు జలపాతానికి అధికారులు తాత్కాలికంగా నో ఎంట్రీ...
- Advertisement -
- Advertisement -


