ఉప్పల్ మ్యాచ్ రద్దు కావడంతో సన్రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. రాత్రి గుజరాత్తో హైదరా బాద్లో మ్యాచ్ జరగాల్సి ఉంది. నిన్న కురిసిన భారీ వర్షానికి ఈ మ్యాచ్ రద్దయింది. దాంతో ఎంఫైర్లు ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.టోర్నీలో ఇప్పటిదాకా 14 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఖాతాలో మొత్తం 15 పాయింట్లు ఉన్నాయి. ఇప్పటికే కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్లో ప్రవేశించాయి. ఇప్పుడు, సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టయింది. సన్ రైజర్స్ ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న నేపథ్యంలో, అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇక, నాలుగో బెర్తు కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూ రు మధ్య ఆసక్తికర పోరు నెలకొంది. ఆర్సీబీ, సీఎస్కే మ్యాచ్ మే 18న బెంగళూరులో జరగనుంది. వరుస విజయా లతో ఊపుమీదున్న బెంగళూరును నిలువరించేందుకు చెన్నై ఏం చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 200 పరుగులు చేస్తే, లక్ష్యఛేదనను 18.1 ఓవర్లలో పూర్తి చేసిన జట్టు రన్ రేట్ పరంగా నాలుగో బెర్తును ఖాయం చేసుకుంటుంది. లేదా ఈ మ్యాచ్లో 18 పరుగుల తేడా తో గెలిచినా నాలుగో బెర్తును దక్కించుకుంటుంది.


