తుక్కుగూడలో శనివారం నిర్వహించిన జనజాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్రెడ్డి వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఓ మహా సముద్రం.. అందులో తమ కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు అని అన్నారు. తమ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు అని కొనియాడారు. వాళ్లు త్యాగశీలురు, తెగించి కొట్లాడే వీరులు అని చెప్పారు. జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. అజెండాలు నిర్ణయించే నాయకులు అని తెలిపారు. తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది అని సీఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు.


