27.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టులు అలజడి

పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టుల అలజడి కలకలం సృష్టిస్తోంది. ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి నిన్నటి వరకు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్టులు మృతి చెందారు. సరిహద్దులోని బీజాపూర్ జిల్లా గంగులూరు స్టేషన్‌ పరిధిలో సాయుధ బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈనేపథ్యంలోనే పొర్చెలి అటవీ ప్రాంతంలో వారికి మావోయిస్టులు తారపడ్డారు. దీంతో బలగాలకు, మావోయిస్టులకు మధ్య దశల వారీగా కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు మ‌హిళా మావోయిస్టులు..స‌హా మొత్తం 13 మంది మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పోలీసు వర్గాలు చెప్పాయి.

     ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు డంప్‌ను డీవీఎఫ్‌, నిఘా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కలిమెల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దయాల్తుంగ్ సరిహద్దు పోలీసుల గాలింపుల్లో ఈ డంప్‌ దొరికిందని చెప్పారు. ఈ డంప్‌లో పెద్ద మొత్తంలో ఐఈడీలు, ఐఈడీ తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సాధారణ పౌరులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీలుగా వీటిని దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్