శత్రువులు జయించలేని నగరంగా గుర్తింపు పొందిన అయోధ్య శతాబ్దాల పాటు మొఘలాయిల పాలనలో మగ్గిం ది.ఇస్లాం ప్రభావితమైన కాలంలో అయోధ్య శిథిలావస్థకు చేరింది. అప్పటి నుండి వందల ఏళ్లపాటు మధ్య రామ మందిర వివాదం రగులులుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ రామమందిర నిర్మాణం కోసం శతాబ్దాలుగా భార త దేశం నిరీక్షించింది. స్వాతంత్ర్యం అనంతరం రామమందిర నిర్మాణ కల ఎట్టకేలకు మోదీ చొరవతో సాకార మైంది. నూతన ఆలయంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘట్టాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామ భక్తులు సంబరాలు చేసు కున్నారు. ఈ సందర్భంలోనే బోర్డర్ లో పహారా కాస్తున్న చైనా సైనికులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ఆ వీడి యో ఇప్పడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. వాస్తవాదీన రేఖ వెంట భారత సైన్యంతో కలిసి చైనా భద్రతా దళాలు నినాదాలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఒకప్పుడు భారత్ – చైనా సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంబడి కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సమస్యల పరిష్కారం కోసం ఇరు దేశాల సైనికాధికారులు పలుమార్లు చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యం లోనే తాజాగా ఓ ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. ‘జై శ్రీరామ్’ అనే నినాదాన్ని ఎలా పలకాలో చైనా సైనికులకు భారత్ సైనికులు నేర్పుతున్నట్టు ఆ వీడియోలో ఉంది. దీంతో ఆ వీడియోలో చైనా దళాలు జైశ్రీరామ్ అని నినాదం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఒక మాజీ సైనికుడు అయోధ్య ప్రాణప్రతిష్ట జరిగిన రోజే ఎక్స్ లో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.