ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి… UPSC ఛైర్మన్ మనోజ్ సోనీతో సమావేశమయ్యారు. UPSC తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పకడ్బందీగా తీర్చిదిద్ది, ప్రశ్నపత్రాల లీకేజీలు లేకుండా చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో TSPSC ప్రక్షాళనపై యూపీఎస్సీ ఛైర్మన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. పరీక్షల నిర్వహణలో UPSC అవలంబిస్తున్న విధానాలను తెలుసుకున్నారు. రేవంత్ వెంట మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ఇద్దరు ఐఏఎస్లు అధికారులు ఉన్నారు.


