బంకుల ఎదుట నో స్టాక్ బోర్డ్ – బారులు తీరిన వాహనదారులు

నగరంలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు కి.మీ మేర క్యూ కట్టారు. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగనున్నారు. దీంతో వాహనదారులు అలర్ట్ అయ్యారు. నగరంలో ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల ముందు వాహనదారుల క్యూ కట్టారు.

మోటారు వాహనాల చట్ట సవరణ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో లైఫ్ టాక్స్ పెరగనుంది.దీంతో కేంద్ర మోటారు వాహ నాల చట్ట సవరణను వ్యతిరేకిస్తూ పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకు దిగారు. దీంతో మొత్తం దేశంలో ఉన్న పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్స్ డ్రైవర్లు సమ్మె రెండో రోజుకు చేరింది. ఆ సమ్మె ప్రభావం పెట్రోల్, డీజిల్ రవాణాపై పడిం ది. ఈ క్రమంలో హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు బారులు తీరారు. ఫుల్ ట్యాంక్ కోసం వాహనదారులు పట్టుబడుతుంటే, యజమానులు అందుకు నిరాకరిస్తున్నారు. కేంద్రం పెట్రోల్ డీజల్ రేట్లు తగ్గిస్తుందనే భావనలో బంక్ ల యజమానులు పెట్రోల్ , డీజల్, ఫుల ట్యాంక్ చేయించు కోలేదు. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో నగరంలో పలు చోట్ల పెట్రోల్ బంక్ యజమానులు నో స్టాక బోర్డులు పెట్టారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్