స్వతంత్ర వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ లండన్లో గ్రీన్ యాపిల్ అవార్డులను అందుకున్నారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయం సహా 5 నిర్మాణాలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ గ్రీన్ యాపిల్ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా లండన్లోని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి అర్వింద్ కుమార్ అవార్డులను అందుకున్నారు. తెలంగాణ సచివాలయం, మొజాంజాహీ మార్కెట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, పోలిస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, యాదాద్రి దేవాలయానికి వివిధ కేటగిరీల కింద ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ అవార్డులు లభించాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం. దేశంలోని నిర్మాణాలు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులను అందుకోనుండడం ఇదే తొలిసారి కాగా, ఒక్క తెలంగాణకే ఐదు విభాగాల్లో అవార్డులు రావడం తెలంగాణకు దక్కిన మరో ఘనత. ఇక్కడి భవనాల డిజైన్, ఆర్కిటెక్చర్ ప్రతిభకు ఈ అవార్డులు అద్దం పడుతున్నాయని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.