స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్టై జైలులో ఉంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టు కొంత వెసులుబాటు కల్పించింది. తనను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలన్న ఆయన అభ్యర్థనకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా మేజిస్ట్రేట్కు సిఫార్సు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముందు సీబీఐ కోర్టులో తనకు బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్పై విచారణ వాయిదా పడింది. ఈనెల 5కు విచారణను వాయిదా వేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. కాగా వివేకా హత్య కేసులో అరెస్టై ఏప్రిల్ 16నుంచి భాస్కర్రెడ్డి చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
ప్రత్యేక కేటగిరీ ఖైదీగా వైఎస్ భాస్కర్ రెడ్డి
0
582
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


