అలర్ట్: ఎండలతో మండిపోనున్న తెలుగు రాష్ట్రాలు

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణలో భానుడి భగభగలు ఆగడం లేదు. నేటి నుంచి మూడు రోజుల పాటు ఎండలు ఠారెత్తించనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఈ మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని.. అత్యధికంగా 43డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా జూన్ ఒకటి నుంచి 5 రోజులపాటు 44డిగ్రీల ఉష్ణోగ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వాయవ్య, పశ్చిమ దిశల నుంచి దిగువస్థాయి గాలులు తెలంగాణ వైపు వీస్తుండంతోపాటు పొడి వాతావరణమే ఎండల పెరుగుదలకు కారణమని వెల్లడించారు.

అటు ఏపీలోనూ ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు 97 మండలాల్లో వడగాల్పులు, రేపు 4 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 47 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అక్కడి అధికారులు తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా రేణిగుంటలో 43.9 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 43.7డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 43.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో మన్యం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయన్నారు.

Latest Articles

తెరుచుకున్న తుంగభద్ర గేట్లు… ముగ్గురు ముఖ్యమంత్రుల పూజలు

కర్ణాటక: తుంగభద్ర డ్యామ్‌ 33 కొత్త క్రస్ట్‌ గేట్లు తెరుచుకున్నాయి. గేట్లను ముగ్గురు సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్‌ ప్రారంభించారు. 17వ గేటును కేంద్రమంత్రి సీఆర్‌పాటిల్ ప్రారంభించారు. 18వ గేటును...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
425,369SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్