స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజధాని చెన్నైలో ఐటీ అధికారుల దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. డీఎంకే సీనియర్ నేత రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి. సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. చెన్నై, కోయంబత్తూరు, కరూర్ జిల్లాల్లోని 40 ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్న్స్ దాఖలుకు సంబంధించిన పత్రాలను పరిశీలిస్తున్నారు. మరోవైపు కరూర్లో తనిఖీలకు వ్యతిరేకంగా డీఎంకే కార్యకర్తలు ఐటీ అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు భయంతో వెనక్కి తిరిగి వెళ్లిపోయారు.
చెన్నైలో ఐటీ అధికారులపై డీఎంకే కార్యకర్తల దాడులు
0
332
Previous article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


