బీజేపీని వీడే ప్రసక్తే లేదు: ఈటల రాజేందర్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తలపై ఆ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేయడమే తన లక్ష్యమని అది బీజేపీతోనే సాధ్యమని తెలిపారు. బీజేపీ నాయకులతో తనకు పడటం లేదని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. తనకు ఎవరితో విభేదాలు లేవని.. ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వంలో ఓ సైనికుడిలా పని చేస్తున్నానని పేర్కొన్నారు. కాగా ఈటల పార్టీ మారబోతున్నట్లు కొన్ని పత్రికలతో పాటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్