కర్నాటక ఎన్నికల ఫలితాలపై సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: కర్నాటక ఎన్నికల ఫలితాలపై మాజీ సీఎం, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సిద్ధ రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మత రాజకీయాలను ప్రజలు నమ్మలేదన్నారు. బీజేపీపై ప్రజలు విసిగిపోయారని.. మాకు ఎవరి మద్దతు అవసరం లేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో120 స్థానాలకు పైగా గెలుస్తామని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

సొంతంగా అధికారంలోకి వస్తామన్న ఆయన.. ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్దులు ఆధిక్యంలో కొనసాగుతున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాపాడుకునే క్రమంలో డీకే శివకుమార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఏఐసీసీ నుంచి కీలక సూచనలు వచ్చాయి. గెలిచిన అభ్యర్దుల్ని బెంగళూరు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో గెలిచిన అభ్యర్థులకు భారీగా భద్రత పెరిగినట్లు తెలుస్తోంది.

Latest Articles

ఓబెరాయ్ హోటల్‌కు టీటీడీ స్థలం కేటాయింపుపై భూమన ఆగ్రహం

తిరుపతి అలిపిరి జూపార్క్ రోడ్డులో ఓబెరాయ్ హోటల్ నిర్మాణానికి టీటీడీ స్థలం కేటాయించడంపై మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ స్థలాన్ని ప్రైవేట్ సంస్థకు కేటాయించడాన్ని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్