ఢిల్లీకి చెందిన దంపతులు ఘోరానికి పాల్పడ్డారు. కన్నబిడ్డనే గంగానదిలో ముంచి చంపేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్ లో ఈ దారుణం జరిగింది. 5 ఏళ్ల పిల్లవాడిని పదేపదే నీటిలో ముంచేస్తున్న తల్లిదండ్రులను చూసిన అక్కడే ఉన్న వారు…ఆపండి…ఆపండి..అని కేకలు పెట్టారు. తల్లిదండ్రులు వినక పోవడంతో వారే బలవంతంగా పిల్లాడిని వెలికి తీశారు. అయితే, అప్పటికే పిల్లవాడు చనిపోయాడు. బాలుడు చిన్నప్పటి నుంచి బ్లెడ్ కేన్సర్తో బాధపడుతున్నా డు. చికిత్స కోసం లక్షలు ఖర్చుచేసినా ఫలితం లేకుండపోయింది. దాంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు పిల్లాడి తల్లితో సహా ముగ్గురిపై కేసు నమోదు చేశారు. గంగలో ముంచితే అద్భుతం జరిగి పిల్లాడు ఆరోగ్యవంతుడు అవుతాడన్న ఆశతో ఈ పనికి పాల్పడినట్లు ఆ పిల్లాడి తల్లిదండ్రులు తెలిపారు.