తెలంగాణలో గంజాయి చాక్లెట్లు కలకలం సృష్టిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో గంజాయి చాక్లెట్లను పోలీసులు పట్టుకున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టైంది. కోకాపేట్ ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఒడిస్సాకు చెందిన సౌమ్యా రాజన్గా గుర్తించారు. పక్క సమాచారంతో పట్టుకుని 40 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఓ అపార్టుమెంట్లో కార్మికులకు అమ్ముతుండగా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు పట్టుకుని అరెస్టు చేశారు. సోమ్య రాజన్ ఒడిస్సా నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వచ్చి గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, ఖమ్మంలో గంజాయి చాక్లెట్లు కలకలం
0
462
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


