తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైరయ్యారు మాజీ మంత్రి హరీశ్ రావు. హైడ్రాను అడ్డు పెట్టుకొని హైదరాబాద్ను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. హైడ్రా వల్ల పేదలు ఇళ్లు కోల్పోతున్నారని అన్నారు. శనివారం వచ్చిందంటే ప్రజలు వణికిపోతున్నారని.. పేదల ఉసురుపోసుకుంటున్న రేవంత్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. హైదరాబాద్ మల్కాజ్ గిరిలో బీఆర్ఎస్ నేత జగదీశ్ గౌడ్ ఏర్పాటు చేసిన అమ్మవారి మండపానికి హరీశ్ రావు వచ్చారు. ఈ సందర్భంగా దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని హరీశ్ రావు తెలిపారు.