బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై సుబేదారి పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 504, 505 కింద కేసు నమోదు చేశారు. రైతు సంగ్రామ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి సీపీ సన్ప్రీత్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు కేటీఆర్పై కేసు నమోదు చేశారు పోలీసులు.


