మేం ఎవరి పెరడులోనో బతకడం లేదు…మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు

       ఐదు రోజులపాటు  చైనా పర్యటన  ముగించుకుని మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు స్వదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశ ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రుల వ్యాఖ్యలతో  ఇరుదేశాల మద్య దౌత్య వివాదాలు నెలకొ న్నాయి. ఈ నేపథ్యంలో  ఆ దేశ అధ్యక్షుడు అక్కడి విలేకరులతో  తన అభిప్రాయాలను వెల్లడించారు. భౌగోళికంగా తమ  దేశం చిన్నదే ..అయినంత యమాత్రాన తమను బెదిరించడం తగదని, మాల్దీవుల  అధ్యక్షుడు మయిజ్జు పేర్కొ న్నారు. 
      చుట్టూ సముద్రపు నీరే ఆవరించి ఉన్న సముద్రంలో మావి చిన్న ద్వీపాలే …అయినప్పటికీ తమకు సముంద్రంలో  దాదాపు 9 లక్షల చ.కి.మీ  ప్రత్యేక ఆర్థిక మండలి ఉందని అన్నారు. ఇన్ని ద్వీపాల సముదాయంలో ఉన్న మా దేశం ఒకటిగా గుర్తించాలి. ఈ మహా సముద్రం ఏ ఒక్క దేశానికో చెందదు. ఈ సముద్రం చుట్టూ ఉన్న దేశాలన్నింటిదీ అని స్పష్టం చేశారు.మేం ఎవరి పెరడులోనే బతకడం లేదని, తమది స్వతంత్ర సార్వభౌమ దేశం అని ఈ సందర్భంగా  చెప్పారు. ఇదిలా ఉండగా మాల్దీవుల అంతర్గత వ్యవహారాల్లో ఏ దేశం  జోక్యం చేకున్నా వ్యతిరేకిస్తామని చైనా మరో వైపు  ప్రకటించింది. అయితే మాల్దీవుల  అధ్యక్షుడు తన ప్రసంగంలో భారత దేశాన్ని ఉద్దేశశించి ఎక్కడా ప్రస్తావించిన ట్టు లేదు. కానీ ముయిజ్జు  మాటల దాడి మాత్రం భారత దేశంపైనేనని స్పష్టంగా తెలుస్తోంది. 

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్