స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ సీజన్ కు సంభందించి 60% ధాన్యం పొలాల్లోనే ఉందని మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యం పంటలను చంద్రబాబు పరిశీలించారు. అకాల వర్షాలకు రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నా.. సీఎం, మంత్రులు ఎందుకు పరామర్శించడం లేదని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వానికి రైతులంటే చిత్తశుద్ధి లేదని అన్నారు. కనీసం రైతులకు ధాన్యం సంచులు కూడా ఇవ్వలేని ఈ ప్రభుత్వాన్ని ఏమనాలని అన్నారు. గత నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పొలాల్లో దిగి రైతు బాధలు చూశారా? అని మండిపడ్డారు. గతంలో హుద్ హుద్ తుఫాన్ అతలాకుతలం చేసే సమయంలో తాను అహర్నిశలు పనిచేశానని.. కానీ తుఫాన్ వస్తే అటువైపు కూడా చూడట్లేదన్నారు.