హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు చేశారు. హిమాయత్నగర్లో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్, ఎల్బీ నగర్ లోని రవిశర్మ ఇంట్లోతనిఖీలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. కూకట్ పల్లి పీఎస్ పరిధిలో సంజయ్ దీపక్ రాజ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న వేణుగోపాల్, రవిశర్మ, కేరళకు చెందిన మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. రవిశర్మ ఇంటిపై దాడి చేసిన ఎన్ఐఏ అధికారులు…మొబైల్ తోపాటు పాత బుక్స్, 1990 కంటే ముందు ఉన్న ఫొటోస్ కు చెందిన కరపత్రాలు స్వాదీనం చేసుకున్నారు. ఈ నెల 10న ఎన్ఐఏ కార్యాల యానికి హాజరుకావాలని ఎన్ఐఏ అడిషనల్ ఎస్పీ రాజ్ కుమార్ నోటీసులు జారీ చేశారు.