మత్తులో గమ్మత్తుగ చిత్తైపోతావని ఓ కవి అన్నట్టు ఎంతో మంది జీవితాల మధ్యం మత్తులో పడి నాశనం చేసుకుం టున్నారు. అలాంటి సంఘటనే సికింద్రాబాద్ లో చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఇద్దిరి స్నేహితుల మధ్య ఘర్షణ తలెత్తింది.వివరాల్లోకి వెళితే సికింద్రాబాద్ తుకారం గేట్ పీఎస్ పరిధిలో దుర్ఘటన జరిగింది. గోల్ బాయ్ బస్తీకి చెందిన చారి, అజయ్ కిమధ్య మటన్ తినే విషయంలో చిన్నగొడవ ప్రారంభమైంది. అప్పటికే ఇద్దరు మద్యం పూటుగా తాగేసి ఉండడంతో గొడవ మరింత పెద్ద అయ్యింది. ఈ క్రమంలో అజయ్ కత్తితో చారిపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృత్యు వాత పడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నింది తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.