అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో..వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిప డ్డారు. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ సర్వనాశనం అయిందని విమర్శించారు. అదే విధంగా ప్రజలు కూడా ఓ కింత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చేస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ..50 వేలకు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.