20.2 C
Hyderabad
Wednesday, February 4, 2026
spot_img

సీఎం జగన్ అనంతపురం పర్యటన వాయిదా!

CM Jagan Mohan Reddy | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రేపటి అనంతపురం జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ పర్యటనను ఈ నెల 26కి వాయిదా వేసినట్లు సీఎంవో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 26న అనంతపురం జిల్లా నార్పలలో సీఎం పర్యటించి.. జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా రేపు ముస్లిం సోదరులకు జగన్ ప్రభుత్వం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయనుంది. విజయవాడ విద్యాధరపురం మినీ స్టేడియంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందులో సీఎం జగన్ పాల్గొని ముస్లిం సోదరులతో ముచ్చటించనున్నారు.

అంతకముందు షెడ్యూలు ప్రకారం అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో రేపు (ఏప్రిల్ 17) సీఎం జగన్ పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో భాగంగా జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల అకౌంట్ లలో డబ్బు జమచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు అధికార యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. సీఎం పర్యటన వాయిదా పడటడంతో వైసీపీ శ్రేణుల్లో కాస్త ఉత్సాహం తగ్గినట్లయింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్